ఆ మహిళ ఐఎస్‌ఐఎస్‌లో చేరలేదు: సీపీ | Sakshi
Sakshi News home page

ఆ మహిళ ఐఎస్‌ఐఎస్‌లో చేరలేదు: సీపీ

Published Sun, Feb 1 2015 7:36 AM

The woman did not ISIS: CP

  • రెండు నెలల కిందటే కౌన్సెలింగ్ ఇచ్చాం  టర్కీ వెళ్లిన వారిపై ప్రత్యేక నిఘా
  •  సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కి చెందిన ఓ మహిళ ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్, అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్లి ఆ తర్వాత మనసు మార్చుకుని తిరిగి స్వదేశానికి చేరుకుందని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో రెండు నెలల కిందటే ఆమెను పిలిపించి  కౌన్సిలింగ్ చేశామన్నారు. మీడియాలో వచ్చిన ప్రకారం ఆమె ఇరాక్‌లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థలో రెండు నెలలు శిక్షణ తీసుకుందని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు సిద్ధమైన పలువురు నగర యువకులను వారి కుటుంబ సభ్యులతో కలసి కౌన్సెలింగ్ చేశామన్నారు. అయితే టర్కీ, ఇరాక్, సిరియా వెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
     

Advertisement
Advertisement