ప్రజా దర్బార్‌కు తమిళిసై.. | Telangana Governor Tamilisai Soundararajan Reacts On Praja Darbar | Sakshi
Sakshi News home page

ప్రజా దర్బార్‌పై తమిళిసై స్పందన

Sep 16 2019 7:51 PM | Updated on Sep 16 2019 7:59 PM

Telangana Governor Tamilisai Soundararajan Reacts On Praja Darbar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెలంగాణలో ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి నూతన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారానికోసారి సామాన్య ప్రజల కోసం ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఎంబీటీ నేత అమ్జద్‌ ఉల్లాఖాన్‌ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి వెంటనే స్పందించిన తమిళిసై.. ‘మీ ప్రతిపాదనకు నా ధన్యవాదాలు. ఈ విషయం నా దృష్టిలో కూడా ఎప్పటి నుంచో పరిశీలనలో ఉంది’ అంటూ రిప్లే ఇచ్చారు. దీంతో త్వరలోనే ప్రజాదర్బార్‌ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement