తెలంగాణకు చెందిన సినీ కార్మికులు, చిన్న నిర్మాతలు, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించకపోతే పోరాటం చేసి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని తెలంగాణ ఫిల్మ్చాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించింది.
తెలంగాణకు చెందిన సినీ కార్మికులు, చిన్న నిర్మాతలు, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించకపోతే పోరాటం చేసి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని తెలంగాణ ఫిల్మ్చాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించింది. సోమవారం క్లాక్టవర్ ప్రాంతంలోని ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో తెలంగాణ సినీ నటుడు దాదాపాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ జేఏసీ చైర్మన్ జైహింద్గౌడ్, చాంబర్ చైర్మన్ అమ్రిష్కుమార్, చాంబర్ మాజీ అధ్యక్షులు విజయేందర్రెడ్డిలు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి చెందిన కార్మికులకు, కళాకారులకు, పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తుందనుకుంటే పరిస్థితి మారకపోగా ఇంకా అన్యాయం కొనసాగుతూనే ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తాము కూడా ఉద్యమాల్లో పాల్గొన్నామని తెలిపారు. తెలంగాణకు చెందిన సినీ పరిశ్రమ గురించి ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా వెలువడలేదని వాపోయారు.
చౌటుప్పల్ ప్రాంతంలో చేపట్టే తెలంగాణ ఫిల్మ్సిటీ కి పైడి జయరాజ్ పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన చిన్న నిర్మాతలను ఆదుకునేలా రాయితీలు అందించాలని, మంచి సినిమా తీసిన వారికి రూ.5 కోట్ల బహుమానం అందించాలని సూచించారు.