కొత్త గవర్నర్ బాధ్యతల స్వీకరణ నేడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన తమిళిసై సౌందర రాజన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉద యం 8 గంటలకు ఆమె చెన్నై నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్.చౌహాన్ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొంటారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్గా, తొలి మహిళా గవర్నర్గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్భవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు.