నల్లగొండలోని రామగిరిలో వికలాంగుల హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
Nov 27 2016 2:40 AM | Updated on Nov 9 2018 4:45 PM
రాంనగర్ : నల్లగొండలోని రామగిరిలో వికలాంగుల హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ దళిత బహుజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఉడుగు కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. హాస్టల్లో వండుతున్న భోజనంలో పురుగులు వస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ కూడా విద్యార్థుల స్థితిగతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీహెచ్. మహేశ్, మధు, సారుు, అంజి, రాజు, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement