తల్లి మందలించిందని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని లోహితలో చోటు చేసుకుంది.
శ్రీలత కాళ్లు చేతులు గుంజుతున్నాయని పాఠశాలకు వెళ్లనని అనడంతో.. బుధవారం ఉదయం పత్తికి ఎరువులు వేయడానికి వెళ్తూ తల్లి భద్రి కూతురును బడి వెళ్లమని మందలించింది. అనంతరం తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా, తోబుట్టువులు శిరీష, రాజేందర్ బడికి వెళ్లిపోయారు. తల్లి మందలించిందనే మనస్తాపంతో శ్రీలత ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పత్తికి ఎరువు వేసి ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులు తలుపులు తెరిచి చూసేసరికి కూతురు విగతజీవిగా కనిపించింది. దీంతోవారు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి తల్లి భద్రి ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.క్రాంతికుమార్ తెలిపారు.