
పాము కలకలం
జనావాసంలోకి ప్రవేశించిన ఏడు అడుగుల పాము కలకలం రేపింది.
హైదర్షాకోట్ (రంగారెడ్డి): జనావాసంలోకి ప్రవేశించిన ఏడు అడుగుల పాము కలకలం రేపింది. రాజేంద్రనగర్ మండలం హైదర్షాకోట్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో నారాయణరెడ్డి ఇంట్లోకి శుక్రవారం ఏడు అడుగుల పొడవు ఉన్న జెర్రిపోతు ప్రవేశించింది. దాన్ని చూసి నారాయణరెడ్డి భార్య భయంతో కేకలు వేయడంతో... ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు సైదల్ మొహమ్మద్ ఆదిల్, సయ్యద్ గౌస్ వెంటనే అక్కడకు చేరుకొని పామును పట్టుకోవడంతో ఇంటి వారితో పాటు కాలనీ వారు ఊపిరి పీల్చుకున్నారు.