సమాచార కమిషనర్ల ప్రమాణం | RTI Commissioners Appointed In Telangana | Sakshi
Sakshi News home page

సమాచార కమిషనర్ల ప్రమాణం

Feb 26 2020 3:22 AM | Updated on Feb 26 2020 3:22 AM

RTI Commissioners Appointed In Telangana - Sakshi

ప్రతికాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా (ఆర్‌టీఐ) సీనియర్‌ జర్నలిస్టులు కట్టా శేఖర్‌రెడ్డి, మైదా నారాయణరెడ్డి, గిరిజన విద్యార్థి నేత గుగులోతు శంకర్‌నాయక్, న్యాయవాదులు సయ్యద్‌ ఖలీలుల్లా, మహ్మద్‌ అమీర్‌ హుస్సేన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో వారితో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ ఎస్‌.రాజా సదారాం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఐదుగురు కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వీరు మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ బుద్ధా మురళి, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement