మిర్యాలగూడలో భారీ చోరీ | robbery in nalgonda distirict | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడలో భారీ చోరీ

Jul 17 2015 9:03 AM | Updated on Aug 30 2018 5:27 PM

బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుళ్ల చేసిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్‌బోర్డు కాలనీలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

నల్గొండ: బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుళ్ల చేసిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్‌బోర్డు కాలనీలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కాలనీకి చెందిన డి. పాపయ్య వ్యవసాయ మార్కెట్‌లో గ్రేడ్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. గురువారం అత్తగారికి ఆరోగ్యం బాలేదని కబురు రావడంతో భార్యతో సహా వెళ్లి శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చే సరికి తాళం పగలగొట్టి ఉండటంతో పాటు.. బీరువాలో ఉన్న 14 తులాల బంగారు ఆభరణాలతో పాటు, రూ. 1.50 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ సందీప్ గోనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement