ప్రణయ్‌ హత్యపై రాంగోపాల్‌వర్మ కామెంట్‌

Ram Gopal Varma Responded On Pranay Murder - Sakshi

పరువు కోసమే అయితే.. మారుతీరావు బతకొద్దని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌ : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ప్రణయ్‌ హత్య పై ట్విటర్‌లో స్పందించారు. ప్రణయ్‌ని హత్య చేయించిన మారుతీరావు ముమ్మాటికీ హంతకుడేనని అన్నారు. ఏ మాత్రం ధైర్యంలేని పిరికిపంద అని పేర్కొన్నారు. పరువు కోసం ప్రణయ్‌ని చంపానని చెప్పుకుంటున్న మారుతీరావు ఏం సాధించాడని ప్రశ్నించారు. ‘ఒకవేళ పరువు కోసమే ప్రణయ్‌ ప్రాణాలు తీయించానని చెప్పిన హంతకుడు తన పరువును చేజేతులా బజారుకీడ్చుకున్నాడు. పరువు పోయింది గనుక మారుతీరావు చనిపోయేందుకు సిద్ధంగా ఉండాల’ని అన్నారు.

నిజమైన పరువు హత్య అంటే.. పరువు కోసం ఇతరుల ప్రాణాలు తీసేందుకు వెనకాడని వారిని చంపడమేనని చెప్పుకొచ్చారు. కాగా, తక్కువ కులానికి చెందిన వ్యక్తి తన కూతురుని వివాహం చేసుకున్నాడనే కారణంగా గతవారం యువతి తండ్రి మారుతీరావు ప్రణయ్‌ని హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా వర్మ ట్వీట్‌పై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top