స్వాతంత్య్ర సమరయోధురాలు రాజారత్నమ్మ కన్నుమూత  | Rajaratnamma Great Freedom Fighter Passed Away At Kukatpally | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర సమరయోధురాలు రాజారత్నమ్మ కన్నుమూత 

Jan 20 2020 2:33 AM | Updated on Jan 20 2020 2:33 AM

Rajaratnamma Great Freedom Fighter Passed Away At Kukatpally - Sakshi

కేపీహెచ్‌బీ కాలనీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు కడియాల రాజారత్నమ్మ (106) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ పరిధిలోని ఇందూ ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌లో నివసిస్తున్న కుమార్తె సుగుణ ఇంటిలో ఆమె ఉంటున్నారు. కృష్ణాజిల్లా ఇందుపల్లిలో 1914 జూలై 1న జన్మించిన రాజారత్నమ్మ చిన్ననాటి నుంచే స్వాతంత్య్ర సమరంలో పాల్గొనేవారు. కృష్ణాజిల్లా కాటూరుకి చెందిన కడియాల గోపాలరావును వివాహం చేసుకున్నారు. భర్తతో కలసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భర్త అడుగుజాడల్లో కమ్యూనిస్టు బావజాలంతో సేవలందించారు. స్థానికులు, ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement