రాజన్న లడ్డూ భోగం ధరలు మరింత ప్రియం

వేములవాడ: ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి(రాజన్న) లడ్డూ భోగం ప్రసాదాలు మరింత ప్రియం అయ్యాయి. వీటి ధరలను దేవాదాయ శాఖ భారీగా పెంచేసింది. లడ్డూ భోగం (40 లడ్డూలు) రూ.400లు ఉండగా దానిని రూ.700లకు పెంచింది. సిరా భోగం రూ.౩౦౦ నుంచి రూ.600 లకు, దధ్యోజనం రూ.150 నుంచి రూ.300 లకు పెంచింది. పెరిగిన ధరలు ఈ నెల 13వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఇ.ఒ. దూస రాజేశ్వర్ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top