డీఎస్సీ జాప్యంతో నిరుద్యోగుల ఆత్మహత్య | R Krishnaiah letter to ker on DSC issue | Sakshi
Sakshi News home page

డీఎస్సీ జాప్యంతో నిరుద్యోగుల ఆత్మహత్య

Aug 29 2017 3:16 AM | Updated on Aug 15 2018 9:37 PM

డీఎస్సీ నోటిఫికేషన్‌ జాప్యం కారణంగా ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రని, దీనిపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

సీఎం కేసీఆర్‌కి ఆర్‌.కృష్ణయ్య లేఖ
సాక్షి, హైదరాబాద్‌: డీఎస్సీ నోటిఫికేషన్‌ జాప్యం కారణంగా ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రని, దీనిపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కి బహిరంగ లేఖ రాశారు. నోటిఫి కేషన్‌ జాప్యం కారణంగా ఇటీవలే నారా యణఖేడ్‌లో మన్నేపు రామకృష్ణ అనే నిరు ద్యోగి, అంతకు ముందు మరో నలుగురు మరణించినట్లు పేర్కొన్నారు.

టెట్‌ ఫలి తాల తర్వాత నోటిఫికేషన్‌ జారీ చేస్తామని 15 రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి ప్రకటించినా చేయలేదన్నారు. మూడేళ్లుగా ఆరు సార్లు టీచర్‌ పోస్టుల భర్తీ వాయిదా వేశారని, సెప్టెంబర్‌ 12లోగా టీచర్‌ పోస్టు ల భర్తీ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతిని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement