'సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం' | Qutubullapur mla k p vivekananda takes on kcr government | Sakshi
Sakshi News home page

'సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం'

Mar 5 2015 2:14 PM | Updated on Sep 2 2017 10:21 PM

తెలంగాణ అసెంబ్లీలో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గురువారం హైదరాబాద్లో స్పష్టం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద గురువారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైకోర్టు మొట్టికాయలు వేసిన అనర్హత వేటు ఎందుకు వేయరని అడిగారు.

టీఆర్ఎస్ మేనిఫెస్టో అంశాలపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. కరవు, విద్యుత్ కోత, అమరవీరులు, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అంశాలపై సభలో నిలదీస్తామని వివేకానంద వెల్లడించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement