మహిళను ఢీకొట్టిన కారు: చిన్నారి మృతి | One dead and One injured in road accident | Sakshi
Sakshi News home page

మహిళను ఢీకొట్టిన కారు: చిన్నారి మృతి

Dec 11 2015 7:07 PM | Updated on Aug 30 2018 3:56 PM

భర్త కోసం టీ తీసుకెళ్తున్న మహిళ రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె చేతిలో ఉన్న చిన్నారి మృతిచెందగా.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్ : భర్త కోసం టీ తీసుకెళ్తున్న మహిళ రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె చేతిలో ఉన్న చిన్నారి మృతిచెందగా.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గచ్చిబౌలి క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని భూంది జిల్లాకు చెందిన మమతా బాయి(23) కుటుంబం బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. ఈ క్రమంలో శిల్పారామం సమీపంలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.

కాగా శుక్రవారం భర్త కోసం టీ తీసుకెళ్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా.. వేగంగా వెళ్తున్న కారు ఆమెను ఢీకొట్టింది. అనంతరం ఆమె పై నుంచి దూసుకుపోయింది. ఆ సమయంలో ఆమె చెతిలో ఎనిమిది నెలల పాప ఉంది. ఈ ప్రమాదంలో  పాప మృతిచెందగా.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కారు డ్రైవర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. తీవ్రంగా గాయాలైన మమత పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement