తెలంగాణ రేషన్‌ డీలర్లకు నోటీసులు

Notices to Telangana Ration Dealers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రేషన్‌ డీలర్లకు నోటీసులు జారీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌సబర్వాల్‌ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ..  రేషన్‌డీలర్ల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, సస్పెన్షన్‌కు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మహిళా సంఘాల ద్వారా లబ్ధిదారులకు జులై 5 నుంచి 10 వరకు నిత్యావసర సరకుల పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. స్థానికి పరిస్థితులనుబట్టి సరుకుల పంపిణీ పొడగిస్తామని వెల్లడించారు. రేషన్‌ డీలర్లు తమ బాధ్యతలను విస్మరించడం బాధకరమన్నారు. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1967ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top