రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

Published Thu, Dec 29 2016 2:33 AM

NHRC notice to the state government

సాక్షి,న్యూఢిల్లీ: ఇటీవల నల్లగొండ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో 5ఏళ్ల విద్యార్థి ప్రమాదవశాత్తు సాంబార్‌ పాత్రలో పడి ప్రాణాలు కోల్పోయిన ఉదంతంపై తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం బుధవారం నోటీసులు వచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్‌హెచ్‌ఆర్సీ దీనిపై 6 వారాల్లో గా నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారో నివేదికలో పేర్కొనాలంది. ఈ ఘటన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల భద్రతకు సంబం ధించిందని అభిప్రాయపడింది.

Advertisement
Advertisement