కేటీఆర్‌ను కలిసిన ఎంపీ కవిత | MP Kavitha met IT Minister KTR over Nizamabad IT Park | Sakshi
Sakshi News home page

రూ.50 కోట్లతో నిజామాబాద్‌ లో ఐటీ పార్క్

Oct 9 2017 2:57 PM | Updated on Oct 17 2018 6:06 PM

 MP Kavitha met IT Minister KTR over Nizamabad IT Park - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను నిజామాబాద్‌ ఎంపీ కవిత సోమవారం కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో ఐటీ పార్క్‌ ఏర్పాటు చర్చించారు. భేటీ అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ రూ.50 కోట్లతో నిజామాబాద్‌లో ఐటీ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ 60 ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయని, వచ్చే దసరాకు ఐటీ పార్క్‌ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిజామాబాద్‌ ఐటీ పార్క్‌తో ఉత్తర తెలంగాణకు మేలు చేకూరుతుందన్నారు. అలాగే పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని కవిత పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement