449 మందికి ఉచిత కంటి వైద్యం | More than 449 free eye medicine | Sakshi
Sakshi News home page

449 మందికి ఉచిత కంటి వైద్యం

Feb 2 2016 4:33 AM | Updated on Sep 3 2017 4:46 PM

449 మందికి ఉచిత కంటి వైద్యం

449 మందికి ఉచిత కంటి వైద్యం

మండల కేంద్రం జిన్నారంలోని ప్రభుత్వ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.

 జిన్నారం: మండల కేంద్రం జిన్నారంలోని ప్రభుత్వ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని హెటిరో పరిశ్రమ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పుష్పగిరి కంటి ఆస్పత్రికి చెందిన వైద్యులు పాఠశాలలోని 449 మందిని పరీక్షించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు.

త్వరలోనే కళ్లజోళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని నిర్వాహకుడు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వీరప్రభాకర్, వైస్ ప్రిన్సిపల్ వెంకటయ్య, ఆస్పత్రి కో-ఆర్డినేటర్ శ్రావణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement