బడిపిల్లలకు ‘ఈ–మ్యాగజైన్‌’

Minister Sabitha Indra Reddy Launch E News Magazine Of The School - Sakshi

విద్యార్థుల సక్సెస్‌ స్టోరీలు, టీచర్ల సలహాలు, సూచనలకు చోటు

ఈ–మ్యాగజైన్‌ ‘ఎడ్యుషూర్‌’ను ప్రారంభించిన విద్యామంత్రి సబిత

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ సరికొత్తగా ఈ–మ్యాగజైన్‌ (ఎడ్యుషూర్‌)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పత్రికలో విద్యార్థుల విజయగాథలు, పాఠ్యాంశ బోధన, అభ్యసన కార్యక్రమాలపై ఉపాధ్యాయుల సలహాలు సూచనలు ఇందులో ప్రస్తావిస్తారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ మ్యాగజైన్‌ ఉపయోగపడనుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ ఎడిషన్‌ను ప్రదర్శిస్తారు. వీటిలోని అంశాలను విద్యార్థులకు బోధిస్తారు. ఈ మ్యాగజైన్‌ను మంత్రి పి.సబితారెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం లో దాదాపు 29 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. వీరందరూ ఈ– మ్యాగజైన్‌ను చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యుడు కాలె యాదయ్య, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్‌ నాగేందర్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top