‘అడిగిన అందరికీ పని కల్పించండి’ | minister jupally krishna rao visits Employment Guarantee Scheme works at rangareddy district | Sakshi
Sakshi News home page

‘అడిగిన అందరికీ పని కల్పించండి’

May 19 2016 4:11 PM | Updated on Sep 5 2018 8:24 PM

జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీకి పని కావాలని కోరే హక్కు ఉందని తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

మోమిన్‌పేట: జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీకి పని కావాలని కోరే హక్కు ఉందని తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం చీమల్‌దరి, కేసారం గ్రామాలలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న పనులను గురువారం మంత్రి పరిశీలించారు. కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ రాష్ట్ర కార్యాలయంలో 40 లక్షల మంది కూలీల ఫోన్ నంబర్లు ఉన్నాయని, వారందరికీ సీజన్ ప్రకారం కూలీ రెట్ల వివరాలను మెసేజ్ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవరావు, యాదయ్యపాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement