కల్తీ కల్లుకు యువకుడు బలి | Man dies due to adulterated palm wine | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లుకు యువకుడు బలి

Jun 4 2015 3:13 PM | Updated on Oct 8 2018 5:04 PM

కల్తీ కల్లు తాగి యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం అమరచింతలో గురువారం చోటుచేసుకుంది.

మహబూబ్‌నగర్ : కల్తీ కల్లు తాగి యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం అమరచింతలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... అమరచింత గ్రామానికి చెందిన మహమూద్(38) అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కల్లుకు బానిసయ్యాడు. గురువారం ఉదయం కల్లు సేవించిన మహమూద్ ఇంటికి చేరుకుని స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement