కేటీఆర్ బైక్ ర్యాలీలో అపశృతి | man died in bike rally due to ktr nizamabad vists | Sakshi
Sakshi News home page

కేటీఆర్ బైక్ ర్యాలీలో అపశృతి

Feb 21 2015 1:49 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో శనివారం మంత్రి కే. తారకరామారావు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో శనివారం మంత్రి కే. తారకరామారావు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఆయన రాక సందర్భంగా నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో ఓ టీఆర్ఎస్ కార్యకర్త  చనిపోయాడు. దోమకొండ మండలం బీబీపేట్‌కు చెందిన చాట్ల మహంకాళి(50)  బైక్‌ర్యాలీలో పాల్గొన్నాడు. అయితే  ప్రమాదవశాత్తూ బైక్ నుంచి కిందపడి పోవటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా  చికిత్సపొందుతూ  అతను మరణించాడు.
(బిక్నూర్)
 

Advertisement
 
Advertisement
Advertisement