కేటీఆర్ బైక్ ర్యాలీలో అపశృతి | man died in bike rally due to ktr nizamabad vists | Sakshi
Sakshi News home page

కేటీఆర్ బైక్ ర్యాలీలో అపశృతి

Feb 21 2015 1:49 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో శనివారం మంత్రి కే. తారకరామారావు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో శనివారం మంత్రి కే. తారకరామారావు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఆయన రాక సందర్భంగా నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో ఓ టీఆర్ఎస్ కార్యకర్త  చనిపోయాడు. దోమకొండ మండలం బీబీపేట్‌కు చెందిన చాట్ల మహంకాళి(50)  బైక్‌ర్యాలీలో పాల్గొన్నాడు. అయితే  ప్రమాదవశాత్తూ బైక్ నుంచి కిందపడి పోవటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా  చికిత్సపొందుతూ  అతను మరణించాడు.
(బిక్నూర్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement