దాహంతో వ్యక్తి మృతి | liquor causes to a man desth in nadigudem on friday | Sakshi
Sakshi News home page

దాహంతో వ్యక్తి మృతి

Feb 20 2015 11:17 AM | Updated on Sep 2 2017 9:38 PM

నాటుసారా తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు.

నడిగూడెం : నాటుసారా తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. సిరిపురం గ్రామానికి చెందిన జంపాల బిక్షం(45) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి నాటు సారా తాగుతుండటంతో దాహం వేసింది.

ఈ క్రమంలో అతనికి అందుబాటులో నీళ్లు లేకపోవడంతో మృతి చెందాడు. దీంతో గ్రామంలోని కొందరు వ్యక్తులు నాటుసారా విక్రయాలను నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement