కాంగ్రెస్లో అందరూ సీఎం అభ్యర్థులే: తలసాని
సాక్షి, ఆదిలాబాద్/నిజామాబాద్ అర్బన్ : కాంగ్రెస్ బస్సుయాత్రలో ఉన్న 30 మందిలో 28 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నారని, ఆ పార్టీ నేతలకు పదవులపైనే ధ్యాస తప్పితే.. రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్లో లబ్ధిదారులకు గొర్రెల దాణా పంపిణీ చేశారు. ఇన్సూరెన్స్ క్లైమ్ ద్వారా మళ్లీ కొనుగోలు చేసిన గొర్రెలను లబ్ధిదారులకు అందజేశారు. ఆదిలాబాద్లో గొల్ల, కురుమల సన్నాహక శంఖారావం సభలో, అలాగే.. నిజామాబాద్లోని గొల్లకుర్మ సంఘాల సమ్మేళన సభలో మాట్లాడారు.