కడుపునొప్పి తాళలేక.. | lady suicide in khammam district due to health problems | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి తాళలేక..

Dec 23 2015 2:41 PM | Updated on Sep 3 2017 2:27 PM

ఖమ్మం జిల్లాలో బుధవారం ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో బుధవారం ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన శంకరమ్మ(22) అనే యువతి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement