కేటీఆర్‌.. నా నెంబర్‌ ఎందుకు బ్లాక్‌ చేశావ్‌.. | KTR Meets Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

ఉత్తమ్‌తో కేటీఆర్‌ భేటీ

Feb 23 2019 11:07 AM | Updated on Sep 19 2019 8:44 PM

KTR Meets Uttam Kumar Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కోసం టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని కలిశారు. డిప్యూటీ స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని ఉత్తమ్‌ని కేటీఆర్‌ కోరారు. వీరిద్దరి భేటీ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తన ఫోన్‌నెంబర్‌ను ఎందుకు బ్లాక్‌ చేశారని ఉత్తమ్‌.. కేటీఆర్‌ను అడిగారు. దీనికి కేటీఆర్‌ బదులిస్తూ.. మీ నెంబర్‌ నేను బ్లాక్‌ చెయ్యగలనా?.. నేను కేవలం మెసేజ్‌లు మాత్రమే చూస్తాను అని అన్నారు. కాగా ఏకగ్రీవం ఎన్నిక కోసం అంతకుముందే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కేటీఆర్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement