కేసీఆర్ హామీ.. చంద్రబాబు కమిటీ: కొప్పుల | koppula eshwar takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

కేసీఆర్ హామీ.. చంద్రబాబు కమిటీ: కొప్పుల

Jun 16 2014 3:17 PM | Updated on Jun 4 2019 5:04 PM

కేసీఆర్ హామీ.. చంద్రబాబు కమిటీ: కొప్పుల - Sakshi

కేసీఆర్ హామీ.. చంద్రబాబు కమిటీ: కొప్పుల

రైతు పంట రుణాల మాఫీపై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇస్తే, ఏపీ సీఎం చంద్రబాబు కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.

హైదరాబాద్: రైతు పంట రుణాల మాఫీపై తమ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన హామీ ఇస్తే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రుణమాఫీపై ఎవరి చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టే అర్ధమవుతోందని అన్నారు. ఈ వాస్తవాన్ని విస్మరించి తెలంగాణ టీడీపీ నేతలు సీఎం కేసీఆర్‌పై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

పోలవరం ఆర్డినెన్స్‌ పాపం చంద్రబాబుదేనని అన్నారు. టీటీడీపీ నేతలు ఈ అంశంపై చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. కేసీఆర్‌ విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు. ఆయనకు యేడాది గడువిస్తే ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలుచేస్తారని కొప్పుల ఈశ్వర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement