ఖైరతాబాద్‌ గణేషుని ఎత్తు ఖరారు | Khairatabad Ganesh Idol To Be A 27 Feet | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌ గణేషుని ఎత్తు ఖరారు

Jul 2 2020 6:12 PM | Updated on Jul 2 2020 6:15 PM

Khairatabad Ganesh Idol To Be A 27 Feet - Sakshi

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ వినాయకుడిపై కూడా కరోనా ప్రభావం పడింది. కరోనా నేపథ్యంలో ఈ సారి 27 అడుగుల ఎత్తులో మట్టి వినాయకున్ని ప్రతిష్టంచనున్నట్టు  ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. ధన్వంతరి రూపంలో ఈ ఏడాది ఖైరతాబాద్‌ వినాయకుడు దర్శనం ఇవ్వనున్నట్టుగా కమిటీ సభ్యులు చెప్పారు. ఒక చేతిలో అమృతం, మరో చేతిలో ఆయుర్వేదంతో గణేషుడు కనిపించనున్నారు .ప్రతి ఏడాదిలాగే శిల్పి రాజేందర్‌ వినాయకుడి విగ్రహాన్ని రూపొందించనున్నారు.(చదవండి : కరోనా పరీక్షలు నిలిపేస్తున్నామని ఎలా చెబుతారు?)

కరోనా వ్యాక్సిన్‌ను త్వరగా వచ్చేలా చేయాలని భగవంతుడి ఆశీస్సులు కోరుతూ ఈ ఏడాది ధన్వంతరి వినాయకుడిని ప్రతిష్టనుంచనున్నట్టు కమిటీ సభ్యులు వెల్లడించారు. విగ్రహం తయారుచేయడానికి కావాల్సిన మట్టిని గుజరాత్‌ నుంచి తెప్పించనున్నట్టుగా తెలిపారు. అయితే ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడిని హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయబోమని చెప్పారు. ఉన్న స్థలంలోనే పలు ద్రవాలతో అభిషేకం నిర్వహించి నిమజ్జన ప్రక్రియ పూర్తిచేయనున్నట్టుగా పేర్కొన్నారు. కాగా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే ఖైరతాబాద్‌ వినాయకుడి విగ్రహం తయారుచేయాలని తొలుత భావించారు. అయితే భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తిల మేరకు తాజాగా   27 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement