Sakshi News home page

భూముల క్రమబద్ధీకరణపై కేసీఆర్ సమీక్ష

Published Tue, Mar 31 2015 12:34 PM

kcr review on GO Ms No 58 Land Regularisation Scheme

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం భూముల క్రమబద్ధీకరణపై సచివాలయంలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీవో 58,59లపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ఈ సమీక్ష జరుగుతున్నారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని, దీనిని దరఖాస్తుదారులందరికీ పత్రికాముఖంగా తెలియచేయాలన్న తమ ఆదేశాలను ఇప్పటివరకు అమలు కాకపోవటంపై హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement
Advertisement