9 రైల్వేస్టేషన్‌లకు ఐఎస్‌ఓ–సర్టిఫికేషన్‌ గుర్తింపు

ISO Certification Recognition For 9 Railway Stations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 రైల్వేస్టేషన్‌లకు ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ–14001:2015 సర్టిఫికేషన్‌ గుర్తింపు లభించిం ది. రైల్వే స్టేషన్‌లలో పరిశుభ్రత, పర్యావరణ అనుకూల విధానాల ఆధారంగా ఈ గుర్తింపు లభిస్తుంది. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని తెలంగాణలో ఉన్న హైదరాబాద్‌(నాంపల్లి), సికింద్రాబాద్, కాచిగూడ, నిజామాబాద్, బాసర, వికారాబాద్, ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని విజయవాడ, కర్నూలు సిటీ, నాందేడ్‌ డివిజన్‌ పరిధిలోని పర్లి వైద్యనాథ్‌ స్టేషన్లు ఈ ఘనతను సాధించాయి. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ జాతీ యస్థాయిలో ఎకో–స్మార్ట్‌ స్టేషన్‌లుగా మార్చేం దుకు 36 స్టేషన్‌లను ఇటీవల ఎంపిక చేసింది. అందులో సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లున్నా యి. ఈ ఎంపికకు దోహదం చేసిన అంశాల్లో కొన్ని తాజా సర్టిఫికేషన్‌ గుర్తింపునకు ఉప యోగపడ్డాయని అధికారులు తెలిపారు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top