రైతు బంధు పథకంపై హైకోర్టు విచారణ | Hyderabad High Court Look Into PIL Against Rythu Bandhu Scheme | Sakshi
Sakshi News home page

రైతు బంధు పథకంపై హైకోర్టు విచారణ

Jun 26 2018 1:52 PM | Updated on Sep 19 2018 6:36 PM

Hyderabad High Court Look Into PIL Against Rythu Bandhu Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంపై ఓ వ్యక్తి రాసిన లేఖని హైదరాబాద్‌ హైకోర్టు పిల్‌గా స్వీకరించి, విచారణ చేపట్టింది. రైతు బంధు పథకంలో అవకతవకలు జరిగాయంటూ నల్గొండ జిల్లాకు చెందిన యాదగిరి రెడ్డి హైకోర్టుకు ఈ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు పథకం ద్వారా సామాన్యుల కన్నా భూస్వాములకే ఎక్కువ మేలు జరుగుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. రైతు బంధు పథకంలో మార్పులు చేయాలని కోరారు. 

కాగా, ఈ లేఖను పిల్‌గా స్వీకరించిన కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. దీనిపై రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు జూలై 10వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement