సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని, త్వరలోనే నగరాన్ని స్టార్టప్లకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. బెంగళూరు, గురుగ్రామ్లతో పోలిస్తే హైదరాబాద్ పర్యావరణహితంగా ఉందని, ఇక్కడ మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. రాజధానికి గత 17 ఏళ్లలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి ఐదు ప్రపంచ దిగ్గజ సంస్థలు వచ్చాయన్నారు. హైదరాబాద్ ఒక్కరోజులో అభివృద్ధి చెందలేదని.. ఈ నగరానికి 450 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. గురువారం హైటెక్ సిటీలో జరిగిన టెక్ మహీంద్రా మిషన్ ఇన్నోవేషన్–2018 కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. టెక్ మహీంద్రా కేంద్ర కార్యాలయాన్ని హైద రాబాద్కు తరలించాలని సూచించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీ–హబ్ ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఏడాది టీ–హబ్ సెకండ్ ఫేజ్ను ప్రారంభించనున్నామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19–21 వరకు 3 రోజుల పాటు హైదరాబాద్లో వరల్డ్ ఐటీ కాంగ్రెస్ నిర్వహించబోతున్నామన్నారు.
ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్...
ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో హైదరాబాద్ను వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే నగరాన్ని ఆదర్శంగా నిలుపుతామన్నారు. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ 4 టౌన్షిప్లు నిర్మిస్తున్నామని వివరించారు. నగరంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నామని, ప్రజల దాహార్తిని తీర్చడానికి 10 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం విషయంలో నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సింగిల్ విండో విధానంలో 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తూ పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. రెండు న్నరేళ్లలో టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో 5,500కుపైగా పరిశ్రమలు వెలిశాయన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసు కుపోతోందని, దేశంలోనే అత్యంత ఘనమైన ఆర్థికాభివృద్ధి తెలంగాణలో నమోదైందన్నారు. రోజు వారీ జీవితంలో టెక్నాలజీ కీలకంగా మారిందన్న కేటీఆర్... విద్య, వైద్య రంగాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధ మయ్యే విద్యార్థులకు టీ–శాట్ చానల్స్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, ఉపాధ్యక్షుడు ఏఎస్ మూర్తి, నాస్కామ్ ప్రెసిడెంట్ డేబ్జానీ ఘోష్ పాల్గొన్నారు.
ఐటీలో హైదరాబాద్ దూసుకెళ్తోంది
Published Fri, Dec 15 2017 2:21 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్పీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
లండన్ కు చేరుకున్న సీఎం జగన్
వవన్ కల్యాణ్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
తప్పక చదవండి
- ‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement