ఎంపీ కనకమేడలకు ఘన సన్మానం

A great honor for the MP kanakamedala ravindrakumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ టీడీపీ తరఫున ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీనియర్‌ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ను బుధవారం హైకోర్టు న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావు, ఇరు సంఘాల అధ్యక్షులు జల్లి కనకయ్య, చల్లా ధనంజయ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top