
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గవర్నర్
ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు.
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. తైవాన్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెప్పించిన కొత్త సీసీ కెమెరాల పనితీరు, జీపీఎస్ టెక్నాలజీ తదితర అంశాల గురించి పోలీసుల అధికారులు, గవర్నర్కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
రాష్ట్ర చరిత్రలో గవర్నర్ తొలిసారి కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. గవర్నర్ వెంట హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఉన్నారు.