మెట్రో ప్రయాణికులకు శుభవార్త

Good News For Hyderabad Metro Passengers - Sakshi

మెట్రో ప్రయాణికులకు స్మార్ట్‌మొబిలిటీ 

బ్యాటరీ వాహనాలు, రీచార్జి వాహనాల సరఫరాకు అంకుర సంస్థలకు అవకాశం.. 

9న ప్రత్యేక సదస్సు.. 

సాక్షి,సిటీబ్యూరో : మెట్రోస్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులకు స్మార్ట్‌జర్నీని సాకారం చేసేందుకు హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ, ఎల్‌అండ్‌టీ సంస్థలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. స్టేషన్‌ యాక్సెస్‌ అండ్‌ మొబిలిటీ(ఎస్‌టీఏఎంపీ) కార్యక్రమాన్ని ఈనెల 9న ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి వరల్డ్‌ రిసోర్స్‌ ఇన్సిట్యూట్, టయోటామొబిలిటీ ఫౌండేషన్లు సహకరిస్తున్నట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మెట్రో స్టేషన్లకు వచ్చే ప్రయాణీకులు చివరి గమ్యస్థానం చేరుకునేందుకు అవసరమైన ఎలక్ట్రికల్‌ వాహనాలను అందుబాటులో ఉంచే అంశంపై ఔత్సాహిక అంకుర పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలతో ఈ సదస్సులో చర్చించడంతోపాటు వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు.

ఈ సదస్సు ద్వారా నగరంలో మెరుగైన ప్రజారవాణా వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ప్రధానంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లేవారికి మెట్రో జర్నీని సులభతరం చేయడం,స్టేషన్లకు చేరుకోవడం, తిరిగి వారి ఇళ్లకు చేరుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈనెల 9న జరిగే  ఈ సదస్సుకు ‘ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ టు ఎన్‌హ్యాన్స్‌ అర్బన్‌మొబిలిటీ’ పే రుతో నిర్వహిస్తున్నామని కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ హాజరుకానున్నట్లు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top