స్వాతంత్య్ర సమరయోధుడి మృతి    | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర సమరయోధుడి మృతి   

Published Wed, Aug 29 2018 1:31 PM

Freedom Fighter Died  - Sakshi

సూర్యాపేట రూరల్‌ :  మండలంలోని ఇమాం పేట గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు నాగిరెడ్డి పాపిరెడ్డి(96) మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని మంగళవారం రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుడి కుమారుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు నాగిరెడ్డి ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో పాటు  కుటుంబసభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

నివాళులు అర్పించిన వారిలో ఎంపీ బడుగు లింగయ్యయాదవ్, మార్కెట్‌ చైర్మన్‌ వై.వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, కట్కూరి గన్నారెడ్డి, వెన్న చంద్రారెడ్డి, కక్కిరేణి నాగయ్యగౌడ్, బుడిగె నవీన్, పుట్టా పుల్లారెడ్డి, సైదిరెడ్డితో పాలు పలువురు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement