రైతును రాజు చేయడమే మా లక్ష్యం | Farmer Will Be The King In Telangana Said Etela Rajender | Sakshi
Sakshi News home page

రైతును రాజు చేయడమే మా లక్ష్యం

Jun 26 2019 4:28 PM | Updated on Jun 26 2019 4:32 PM

Farmer Will Be The King In Telangana Said Etela Rajender - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కేసీఆర్ కల 'రైతును రాజును చేయడమేమని, స్థానిక 6 మండలాల రైతులు రాజులు కాబోతున్నారని' వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  ఈటెల  రాజేందర్‌​ ఆనందం వ్యక్తం  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు భూములు నష్ట పోకుండా  కాలువలు, తూముల ఏర్పాటుకు ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్రత్యేక కార్యచరణకు  శ్రీకారం చుట్టారని ఈటెల పేర్కొన్నారు. 

ఈ కాలువల ఏర్పాటు ద్వారా చొప్పదండీ, రామడుగు, గంగాధర, మల్యాల, పెగడపల్లి, ధర్మారం మండలాల రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు.మండలాల్లో రూ.271కోట్లతో 4 ప్రధాన కాలువలు, తూములు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గత 24 సంవత్సరాలుగా ఈ ఆరు మండలాలకు చెందిన ప్రజలు చెరువులో చుక్క నీటిని చూడలేదని తెలిపారు. ఈ కాల్వల నిర్మాణం ద్వారా 31వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. దీంతో రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైతుల కల నెరవేరబోతుందని  ఈటెల స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement