కరెంటు లేక పంటకు నిప్పు | farmer do the Crop fire | Sakshi
Sakshi News home page

కరెంటు లేక పంటకు నిప్పు

Oct 21 2014 4:57 AM | Updated on Aug 28 2018 7:24 PM

కరెంటు లేక పంటకు నిప్పు - Sakshi

కరెంటు లేక పంటకు నిప్పు

కరెంటు కోతలు రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన దాసరి లక్ష్మయ్య మూడు ఎకరాలు కౌలుకు తీసుకోని ఖరీఫ్‌లో నాట్లు వేశాడు.

బీర్కూర్: కరెంటు కోతలు రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన దాసరి లక్ష్మయ్య మూడు ఎకరాలు కౌలుకు తీసుకోని ఖరీఫ్‌లో నాట్లు వేశాడు. ఎకరానికి 12 బస్తాల చొప్పున కౌలు పెట్టాల్సి ఉంటుంది. పంట సాగు చేసేందుకు ఎకరానికి సుమారు రూ. 20 వేలు ఖర్చయింది. వానలు లేవు, కరెంటు సైతం తీవ్ర ఇబ్బందులు పెట్టింది. దీంతో పొట్ట దశకు వచ్చిన పంట కళ్లముందే ఎండిపోయింది. పంట పాలు తాగాల్సిన సమయంలో నీళ్లు లేకపోవడంతో పంట అంతా పొల్లు పోయింది. ఎండిన పంటను చూసి తట్టుకోలేక లక్ష్మయ్య పంటకు నిప్పు పెట్టాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement