అన్నదాత ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆత్మహత్య

Oct 24 2015 5:17 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఘనపురం మండలం రుక్కన్నపల్లి పంచాయతి పరిధిలోని ముందరితండాలో శనివారం చోటుచేసుకుంది.

ఘనపురం (మహబూబ్‌నగర్) : అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఘనపురం మండలం రుక్కన్నపల్లి పంచాయతి పరిధిలోని ముందరితండాలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణ్ నాయక్(38) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు ఎక్కువైపోయింది. అప్పు తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement