పిచ్చికుక్క స్వైరవిహారం | Dog attacks 17members | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క స్వైరవిహారం

May 30 2015 3:56 PM | Updated on Sep 3 2017 2:57 AM

వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో శనివారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది.

స్టేషన్‌ఘన్‌పూర్ : వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో శనివారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కనపడిన ప్రతి ఒక్కరినీ కరవడం మొదలెట్టింది. శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో పాటు, మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారికి స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు పిచ్చికుక్కలను అదుపు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement