మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలంలోని రాంనగర్ కాలనీలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది.
షాద్నగర్ (మహబూబ్నగర్) : మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలంలోని రాంనగర్ కాలనీలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాంనగర్ కాలనీలో నివాసం ఉండే లావణ్య, శ్రీనివాస్ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.