24న కురవికి సీఎం | Sakshi
Sakshi News home page

24న కురవికి సీఎం

Published Thu, Feb 23 2017 4:24 AM

24న కురవికి సీఎం - Sakshi

వీరభద్ర స్వామికి బంగారు కోర మీసాలు సమర్పించనున్న కేసీఆర్‌

సాక్షి, మహబూబాబాద్‌: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఈ నెల 24న మహబూబాబాద్‌ జిల్లాలోని కురవికి రానున్నారు. 2001లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కురవి శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక స్వామివారికి కోరమీసాలు సమర్పిస్తానని మొక్కుకున్నారు.

ఈ మేరకు సీఎం మొక్కులు చెల్లించేందుకు వస్తున్నారు. ఇప్పటికే వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని శ్రీభద్రకాళి అమ్మవారికి కిరీటం, తిరుపతి వెంకటేశ్వరస్వామికి ఆభరణాలు సమర్పించారు. కాగా, సీఎం రాక సంద ర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement