‘చేప మందు పంపిణీకి అనుమతివ్వొద్దు’

Child Rights Commission Demands No Permission to Fish Medicine - Sakshi

నాంపల్లి: కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నగరంలో వచ్చే జూన్‌ 7 నుంచి బత్తిన సోదరుల ఆధ్వర్యంలో చేప మందు పంపిణీకి అనుమతి ఇవ్వొద్దని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు కోరారు. చేప మందు కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది వస్తారని, వీరిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అందరికీ వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా పిల్లలకు త్వరగా కరోనా వ్యాపించవచ్చని,ఎట్టి పరిస్థితుల్లోను చేప ప్రసాదం పంపిణీకి అనుమతించవద్దని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top