నగరంలోని శంషాబాద్లో గురువారం కిడ్నాప్ కలకలం రేపింది.
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్లో గురువారం యువతి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ఎయిర్పోర్టులో ఉద్యోగం కోసం ఇంటర్య్వూకు వచ్చిన యువతిపై కిడ్నాప్ యత్నం జరిగింది. క్యాబ్ డ్రైవర్ తనను కిడ్నాప్కు యత్నించాడంటూ యువతి ఆరోపిస్తోంది. ఆ సమయంలో తనను తాను రక్షించుకునే యత్నంలో డయల్ 100కు సమాచారం అందించినట్టు తెలిపింది. దాంతో అప్రమత్తమైన క్యాబ్ డ్రైవర్ అప్పా జంక్షన్ వద్ద తనను విడిచిపెట్టినట్టు చెప్పింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.