బాబాయి చేతిలో కొడుకు హతం | Brutal murder in Mangapet | Sakshi
Sakshi News home page

బాబాయి చేతిలో కొడుకు హతం

Oct 17 2015 3:09 PM | Updated on Sep 2 2018 4:37 PM

నువ్వు పంటకు నష్టం కలిగించటంపై ముదిరిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. వరంగల్ జిల్లా మంగపేట మండలంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

మంగపేట (వరంగల్) : నువ్వు పంటకు నష్టం కలిగించటంపై ముదిరిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. వరంగల్ జిల్లా మంగపేట మండలంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని దోమెడ పంచాయతీలోని గొత్తికోయల ఆవాసం రాళ్లగూడెంకు చెందిన మడకం సంతోష్(30), అతని పినతండ్రి జోగయ్యకు మధ్య కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. నువ్వు పంట విషయమై గతంలో ఇద్దరూ కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ మరింత ముదిరింది. కత్తి పట్టుకుని చంపేస్తానంటూ వస్తున్న సంతోష్‌ను జోగయ్య గొడ్డలితో తలపై కొట్టటంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement