బీసీ ఎంపీలను రాళ్లతో కొట్టిస్తా: ఆర్.కృష్ణయ్య | bc mp's beated with stones : R.Krishnaiah | Sakshi
Sakshi News home page

బీసీ ఎంపీలను రాళ్లతో కొట్టిస్తా: ఆర్.కృష్ణయ్య

Jun 13 2015 3:01 AM | Updated on Aug 15 2018 9:27 PM

బీసీ ఎంపీలను రాళ్లతో కొట్టిస్తా: ఆర్.కృష్ణయ్య - Sakshi

బీసీ ఎంపీలను రాళ్లతో కొట్టిస్తా: ఆర్.కృష్ణయ్య

పార్లమెంట్‌లో బీసీల సమస్యలను ప్రస్తావించని బీసీ ఎంపీలను రాళ్లతో కొట్టిస్తామని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.

సంగారెడ్డి క్రైం: పార్లమెంట్‌లో బీసీల సమస్యలను ప్రస్తావించని బీసీ ఎంపీలను రాళ్లతో కొట్టిస్తామని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు బీసీలంతా తీవ్రవాదులుగానో, ఉగ్రవాదులుగానో మారుతారని చెప్పారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, సమస్యలపై ఇద్దరు సీఎంలను నిలదీస్తామని చెప్పారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ ఏ ఒక్కరికీ కూడా ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement