సిద్దిపేట అర్బన్: ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పువ్వులను పండుగగా మార్చిన సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. సిద్దిపేటలో మంగళవారం సాయంత్రం జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. రాత్రి కోమటి చెరువు వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణకు బ్రాండ్గా ఉంటుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సిద్దిపేటకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని ఇది సిద్దిపేట ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు. బంగారు తెలంగాణ సాధనలో బతుకమ్మ పండుగ పునాదిగా మారాలన్నారు. ఈ విశిష్టమైన బతుకమ్మ పండుగను బావి తరాలకు పదిలంగా అందించడానికే ప్రతీయేటా బతుకమ్మ పండుగలను జాగృతి నిర్వహిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిరాదరణకు గురైందని ఇప్పుడు రాష్ట్రం ఏర్పడినందు వల్ల మన సంస్కృతిని మనం రక్షించుకోవాలని, ప్రపంచానికి చాటిచెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.
ఐక్యతను పెంచిన బతుకమ్మ పండుగ: మంత్రి హరీష్
తెలంగాణ సుదీర్ఘ ఉద్యమ పథంలో బతుకమ్మ పండుగ అన్ని వర్గాల ప్రజలను ఐక్యంగా నిలిపిందని సమావేశానికి అధ్యక్షతన వహించిన మంత్రి హరీష్రావు అన్నారు. ప్రపంచమంతట బతుకమ్మ పండుగను నిర్వహించడం మన సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమన్నారు. మున్ముందు ఈ పండుగను మరింత వేడుకగా నిర్వహిస్తామన్నారు.
మహిళలకు బతుకమ్మ బంగారు కానుక: డిప్యూటీ స్పీకర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి తెలంగాణ ఆడ పడచులకు బతుకమ్మను కానుకగా ఇచ్చారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి చెప్పారు. 14 యేండ్ల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఇందు లో అమరులైన అమరవీరుల తల్లుల గర్బశోకం తీర్చడానికి కేసీఆర్ రూ. పది లక్షల ఎక్స్గ్రేషియాను చెల్లిం చేందుకు నిర్ణయించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్ బొజ్జా, జెడ్పీ చైర్మన్ రాజమణి తదితరులు మాట్లాడుతూ ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేటలో బతుకమ్మ ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన ఘనత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకే దక్కుతుందన్నారు. అనంతరం బతుకమ్మలను కోమటి చెరువులో నిమజ్జనం చేశారు. కాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ పండుగకు బతుకమ్మ బ్రాండ్
Published Tue, Sep 30 2014 11:44 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement