దేశంలోనే అతి పెద్ద భూ కుంభకోణం | bandaru dattatreya demands detailed enquiry on miyapur land scam | Sakshi
Sakshi News home page

దేశంలోనే అతి పెద్ద భూ కుంభకోణం

Jun 10 2017 2:10 PM | Updated on Aug 11 2018 8:21 PM

దేశంలోనే అతి పెద్ద భూ కుంభకోణం - Sakshi

దేశంలోనే అతి పెద్ద భూ కుంభకోణం

తెలంగాణలో సంచలనం సృష్టించిన మియాపూర్‌ భూ కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.

హైదరాబాద్‌ : తెలంగాణలో సంచలనం సృష్టించిన మియాపూర్‌ భూ కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అధికారులపై సస్పెన్షన్‌తో ఏమీ కాదని, సమగ్ర విచారణ జరిపించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్‌ చేశారు. భూ కుంభకోణానికి పాల్పడిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అన్నారు.

దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన దీన్ని సీబీఐకి కాకుండా సీఐడీకి అప్పగించడంలో రహస్యమేంటని ప్రశ్నించారు. రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేసి, మరి కొంతమంది రిజిస్ట్రార్లను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కాగా మియాపూర్‌ భూ కుంభకోణం నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement