తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 17వ తేదీ వరకు ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది.
	 హైదరాబాద్: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 17వ తేదీ వరకు ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. దసరా సెలవుల నేపథ్యంలో ఈ గడువును పొడిగించినట్లు పరీక్షల విభాగం కంట్రోలర్ ఒక ప్రకటనలో తెలిపింది.
	
	ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 10వ తేదీతో పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. దానిని ప్రస్తుతం 17వ తేదీ వరకు పొడిగించింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది.
	 
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
